Hyderabad | హైదరాబాద్, ఫిబ్రవరి 17 : హైదరాబాద్లో కొన్ని నెలలుగా రికార్డు స్థాయిలో దూసుకుపోయిన ఇండ్ల రిజిస్ట్రేషన్లు తగ్గుముఖం పట్టాయి. జనవరి నెలలో కేవలం 5,411 యూనిట్ల గృహాలు రిజిస్ట్రేషన్లు జరిగాయి. అంతక్రితం ఏడాది ఇదే నెలలో అయిన 5,454 రిజిస్ట్రేషన్లతో పోలిస్తే ఒక్క శాతం తగ్గాయని నైట్ఫ్రాంక్ తాజాగా వెల్లడించింది.
హైదరాబాద్ పరిధిలో నాలుగు జిల్లాలు ఉన్నాయి. వీటిలో హైదరాబాద్, మేడ్చల్-మల్కాజ్గిరి, రంగారెడ్డి, సంగారెడ్డిలు ఉన్నాయి. ఈ నాలుగు జిల్లాలో అయిన ఇండ్ల రిజిస్ట్రేషన్ల విలువ రూ.3,279 కోట్లుగా ఉంటుందని తెలిపింది. సంఖ్య పరంగా చూస్తే తగ్గినప్పటికీ..విలువ పరంగా చూస్తే మాత్రం 24 శాతం పెరిగాయి. ఇండ్ల ధరలు పెరగడం ఇందుకు కారణమని విశ్లేషించింది.