బంజారాహిల్స్, ఏప్రిల్ 27: కరోనా బారినపడిన వారికి హోమియోపతి విధానంలో మంచి మందులున్నాయని డాక్టర్ కేర్ హోమియోపతి మేనేజింగ్ డైరెక్టర్ డా.ఏఎమ్.రెడ్డి తెలిపారు. కొవిడ్ బాధితులకు ఆన్లైన్ ద్వారా చికిత్స అందించేందుకు ‘డాక్టర్ కేర్-కొవి డ్ కేర్’ పేరుతో సేవలు ప్రారంభిస్తున్నామని నగరానికి చెందిన డాక్టర్ కేర్ హోమియోపతి మేనేజింగ్ డైరెక్టర్ డా.ఏఎమ్.రెడ్డి తెలిపారు. జూబ్లీహిల్స్లోని దస్పల్లా హోటల్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డా॥ ఏఎమ్ రెడ్డి. బిగ్బాస్ ఫేమ్ అషురెడ్డితో కలిసి పాల్గొన్నారు. డా॥ ఏఎమ్ రెడ్డి మాట్లాడుతూ, హోమియోపతి విధానం ద్వారా అన్ని రకాలై న వైరల్ జబ్బులను నయం చేయవచ్చన్నారు.
కేంద్ర ప్రభుత్వం ఆయుష్ విభాగం ద్వారా గత ఏడాది నుం చి ఇప్పటిదాకా కరోనా రాకుండా రోగ నిరోధక శక్తిని పెంచేందుకు 20 లక్షల డోసుల హోమియో మందుల ను పంపిణీ చేశామన్నారు. ప్రస్తుతం తీవ్రంగా ఉన్న కరోనాను ఎదుర్కోవడంతో పాటు రానున్న కాలంలో వైరస్ బారిన పడకుండా చూసేందుకు అద్భుతమైన మందులు హోమియో విధానంలో ఉన్నాయని పేర్కొన్నారు. కాగా కొవిడ్ కారణంగా ఆస్పత్రులకు వెళ్లి చికి త్స పొందలేని వారికి కోసం డాక్టర్ కేర్హోమియోపతి ద్వారా ఆన్లైన్ సేవలు ప్రారంభిస్తున్నామన్నారు. భా రత్ ఆయుష్ విభాగం సూచనల మేరకు మే 1 నుంచి 7వ తేదీ వరకు అన్ని డాక్టర్ కేర్ హోమియోపతి బ్రాం చీలలో రోగ నిరోధక శక్తిని పెంచేందుకు ఉచితంగా హోమిమో మందులను పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ మందుల కోసం ఫోన్ నం: 76750 08000లలో సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో సంస్థ సీఈవో డాక్టర్లు సృజన, సారిక, దైవజ్ఞశర్మ పాల్గొన్నారు.