హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్లో ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఆధ్వర్యంలో యునైటెడ్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈసందర్భంగా మాట్లాడిన మంత్రి అలీ.. భారతదేశంలో కులమతాలకు అతీతంగా పండుగలు జరుపుకునే రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం అని అన్నారు. ముఖ్యoగా.. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎమెల్యే గోపినాథ్ బతుకమ్మ పండుగను, రంజన్ పండుగను, క్రిస్మస్ పండుగను కులమతాలకు అతీతంగా ఘనంగా నిర్వహించడం గొప్ప విషయం అని అన్నారు.
ఈ కార్యక్రమంలో మరో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, నియోజకవర్గంలోని పాస్టర్లు, మాజీ డిప్యూటీ మేయర్ బోరబండ డివిజన్ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్, యూసఫ్గూడ డివిజన్ కార్పొరేటర్ రాజ్ కుమార్ పటెల్, రహమత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ సీఎన్ రెడ్డి, వెంగళరావు నగర్ డివిజన్ కార్పొరేటర్ దేదీప్య విజయ, సోమాజిగూడ డివిజన్ కార్పొరేటర్ సంగీత యదవ్, వెంకటేశ్వర కాలనీ డివిజన్ కార్పొరేటర్ మన్నే కవిత రెడ్డి తదితరులు పాల్గొన్నారు.