హైదరాబాద్ : అంబర్పేట పరిధిలోని పటేల్ నగర్ చౌరస్తాలో విషాదం నెలకొంది. మాస్కులు ప్రతి ఒక్కరూ ధరించాలని ప్రజలకు, వాహనదారులకు అవగాహన కల్పిస్తున్న హోంగార్డు గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే హోంగార్డు గంగాచలం మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. గంగాచలం నివాసంలో విషాదఛాయలు అలుముకున్నాయి.