సిటీబ్యూరో, ఆగస్టు8 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్కు తాగునీటిని సరఫరా చేస్తున్న కృష్ణా ఫేజ్-2 రింగ్ మెయిన్-2 నాగోల్ జంక్షన్ వద్ద ఆటో టాక్ నుంచి చర్బుజా మార్బుల్స్ వరకు 1600 ఎంఎం డయా ఎంఎస్ మెయిన్ పైపులైన్కు జంక్షన్ పనులు చేపడుతున్నారు. ఈ పనులు సోమవారం ఉదయం 6 నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కొనసాగుతాయి. దీంతో డివిజన్ నం.2లోని బాలాపూర్, మైసారం, బారాస్, డివిజన్ 5లోని మేకలమండి, భోలక్పూర్, డివిజన్ నం.7 తార్నాక, లాలాపేట్, బౌద్ధనగర్, మారేడ్పల్లి, కంట్రోల్ రూమ్, రైల్వేస్, ఎమ్ఈఎస్, కంటోన్మెంట్, ప్రకాశ్నగర్, పాటిగడ్డ. డివిజన్ 9 హస్మత్పేట్, ఫిరోజ్గూడ, గౌతమ్నగర్, డివిజన్ 10లోని వైశాలినగర్, బీఎన్రెడ్డినగర్, వనస్థలిపురం, ఆటోనగర్, మారుతీనగర్, డివిజన్ 13లోని మహీంద్రాహిల్స్, డివిజన్ 14లోని ఏలుగుట్ట, రామంతాపూర్, ఉప్పల్, నాచారం, హబ్సిగూడ, చిలుకానగర్, బీరప్పగడ్డ. డివిజన్ 19లోని బోడుప్పల్లోని కొన్ని ప్రాంతాలు, డివిజన్ 20లోని మీర్పేట్, బడంగ్ పేట్, శంషాబాద్ ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని అధికారులు పేర్కొన్నారు.