3 లేఅవుట్లు.. 233 ప్లాట్లు
తుర్క యాంజాల్, తొర్రూరు, బహదూర్పల్లి ప్రాంతాల్లో లే అవుట్లు
చదరపు గజానికి కనీస పెంపు రూ.500
సకల సౌకర్యాలతో స్థలాల అభివృద్ధి
సిటీబ్యూరో, జూన్ 25(నమస్తే తెలంగాణ): గ్రేటర్ చుట్టూ ఉన్న శివారు ప్రాంతాల్లో మూడు చోట్ల ఉన్న ప్లాట్లను ఆన్లైన్ వేలం వేసేందుకు హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్లాట్ల వేలం పారదర్శకంగా ఉండేందుకు ఆన్లైన్ విధానాన్ని అమలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్టీసీ మూడు చోట్ల ఉన్న లే అవుట్లలోని ప్లాట్లను ఆన్లైన్లోనే నిర్వహించనుంది. తుర్క యాంజాల్లో సుమారు 9.5 ఎకరాల్లో ఏర్పాట్లు చేస్తున్న లే అవుట్లో 34 ప్లాట్లు, బహదూర్పల్లిలోని 51 ప్లాట్లకు జూన్ 30వ తేదీన, అదే విధంగా జూలై 1,2,4 తేదీల్లో తొర్రూర్లోని 148 ప్లాట్లకు ఆన్లైన్ వేలం వేయనున్నారు. మొత్తం 233 ప్లాట్లకు ఆన్లైన్లోనే వేలం నిర్వహించనున్నారు. గతంలో ఉప్పల్ భగాయత్లో హెచ్ఎండీఏ చేపట్టిన తరహాలోనే పూర్తి స్థాయిలో మౌలిక వసతులను కల్పిస్తూ లే అవుట్లను అభివృద్ధి చేయనున్నారు. తుర్క యాంజాల్లో చరదపు గజానికి రూ.40 వేలు, బహదూర్పల్లి లే అవుట్లో చదరపు గజానికి నిర్ధారించిన కనీస ధరను రూ.25,0000లుగా, తొర్రూర్లో చదరపు గజానికి రూ.20000లుగా నిర్ణయించారు. చదరపు గజానికి కనీస బిడ్ పెంపుదలను రూ.500ల చొప్పున పెంచాల్సి ఉంటుంది.
సకల సౌకర్యాలతో లే అవుట్ల అభివృద్ధి
ప్రభుత్వానికి చెందిన క్లియర్ టైటిల్తో కూడిన భూముల్లో హెచ్ఎండీఏ లే అవుట్లను మాస్టర్ ప్లాన్కు అనుగుణంగా అభివృద్ధి చేస్తున్నారు. విశాలమైన రోడ్లతో పాటు అన్ని రకాల మౌలిక వసతులను కల్పిస్తూ లే అవుట్లలోనే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇళ్లు నిర్మించుకునేందుకు వీలుగా అన్ని సౌకర్యాలను కల్పిస్తారు. ఆన్లైన్ వేలంలో ప్లాట్లను దక్కించుకున్న వారికి ప్లాట్ల రిజిస్ట్రేషన్ మొదలుకొని ఇళ్లు నిర్మించేందుకు ఎలాంటి చిక్కులు రాకుండా అన్ని జాగ్రత్తలు హెచ్ఎండీఏ అధికారులు తీసుకొని లే అవుట్ అనుమతితో పాటు అభివృద్ధి చేసి అప్పగించనున్నారు. ప్రధానంగా హైదరాబాద్ – నాగార్జున సాగర్ జాతీయ రహదారిని అనుకొని ఉన్న తుర్క యాంజాల్లోని 9.5 ఎకరాల్లో ఏర్పాట్లు చేస్తున్న లే అవుట్లో అపార్టుమెంట్లు, బహుళ ప్రయోజనాలకు వినియోగించే కాంప్లెక్సులు, ఇళ్లు నిర్మించుకునేలా లే అవుట్ను అభివృద్ధి చేయనున్నారు.
మూడు ప్రాంతాల్లోని ప్లాట్ల వేలం ఇలా…