సిటీబ్యూరో, జూలై 14(నమస్తే తెలంగాణ): ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ఫెస్ట్ వచ్చే ఏడాది జనవరి వరకు కొనసాగుతుందని తెలిపారు. ఆత్రుత, నిస్పృహ, న్యూనతా భావాలు లేని బలమైన ఆత్మవిశ్వాసంతో కూడిన భావి భవిష్యత్తరాన్ని పెంపొందించాలనే మంచి దృక్పథంతో ఈ హెరిటేజ్ ఫెస్ట్ నిర్వహిస్తున్నట్టు చెప్పారు.
ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా ఎల్కేజీ నుంచి పదో తరగతి వరకు విద్యార్థులు భారతదేశం యొక్క సుసంపన్నమైన సంస్కృతి, వైభవోపేతమైన చరిత్రలను తెలుసుకునేలా, తమ ప్రతిభా నైపుణ్యాలను మరింత పెంపొందించుకునేలా అనేక కార్యక్రమాలను రూపొందించామని వివరించారు. అందులో భాగంగానే కలరింగ్, పెయింటింగ్, గీతా శ్లోక్ పఠనం, పౌరాణిక వస్త్రధారణ, శాస్త్రీయ నృత్యం, గాత్ర సంగీతం, వంటకం, పుష్పాలంకార, రంగోలి, నాటకం, జానపద నృత్యం, కథలు చెప్పడం వంటి వివిధ పోటీలు ఉంటాయని తెలిపారు.
ఈ పోటీలన్నీ పిల్లల సృజనాత్మకత, మేదస్సు, కళాత్మక అభిరుచులను వెలికితీసే లక్ష్యంతో కొనసాగుతాయని తెలిపారు. నగరంలోని “ఫీల్ఖానా, బంజారాహిల్స్, ఘట్కేసర్, కూకట్పల్లి, దిల్సుఖ్నగర్, చైతన్యపురి, కాచిగూడ, సికింద్రాబాద్, శంషాబాద్, కొత్తపేట, మెహిదీపట్నం, బాచుపల్లి, ఎర్రగడ్డ, కంది” తదితర ప్రదేశాలలో పోటీలు జరుగుతాయని వివరించారు. కార్యక్రమాల్లో నమోదు పూర్తిగా ఉచితమని తెలిపారు. మరింత సమాచారం కోసం ఫోన్ నంబర్ 8639273465లో సంప్రదించొచ్చని తెలిపారు. పోటీల్లో గెలుపొందిన వారిని బంగారు, రజత, కాంస్య పతకాలతో పాటు జ్ఞాపికలు, ట్రోఫీలతో సత్కరించనున్నట్టు తెలిపారు.