బంజారాహిల్స్,డిసెంబర్ 11: డిసెంబర్ 19 నుంచి 21 వరకు మాదాపూర్లోని హెచ్ఐసీసీ నోవాటెల్లో నిర్వహించనున్న హైలైఫ్ ఎగ్జిబిషన్కు సంబంధించిన కర్టెన్ రైజర్ కార్యక్రమం సోమవారం బంజారాహిల్స్ రోడ్ నెం 10లోని మార్క్స్ మీడియా సెంటర్లో ఉత్సాహంగా నిర్వహించారు. తెలుగు నటీమణులు స్రవంతి చొక్కారపు, ప్రియా ఇంటూరుతోపాటు మోడల్స్ విభిన్నమైన డిజైనర్ వస్ర్తాలు ధరించి చూపరులను ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ఎగ్జిబిషన్కు సంబంధించిన బ్రోచర్లను ఆవిష్కరించారు.