ఘట్కేసర్ రూరల్, ఫిబ్రవరి 17: బంగారు తెలంగాణ కల సాకారం కావాలంటే తెలంగాణ రాష్ట్ర ప్రదాత, ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన నిరంతరం కొనసాగాలని టీఆర్ఎస్ విద్యార్థి విభాగం మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు చాప భాస్కర్ అభిలషించారు. ఈ సందర్భంగా వెంకన్న స్వామిని ప్రార్థిస్తూ భాస్కర్ తిరుమల కొండ పైకి పాదయాత్రగా గురువారం వెళ్లారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని భాస్కర్ ఆధ్వర్యంలో పలువురు నాయకులు తిరుపతి అలిపిరి నుంచి తిరుమల వేంకటేశ్వరస్వామి గుడి వరకు కాలినడకన పాదయాత్రగా వెళ్లారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలతో ప్రజా సేవలో తరించాలని, బంగారు తెలంగాణ సాకారం కావాలని భగవంతున్ని కోరుకుని పాద యాత్ర చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యదర్శి విజేందర్, టీఆర్ఎస్వీ జిల్లా కోఆర్టినేటర్ రవిచందర్, సురేశ్ రెడ్డి పాల్గొన్నారు.