కొండాపూర్, ఏప్రిల్ 14 : మాదాపూర్లోని హెచ్ఐసీసీ నోవాటెల్లో ఏర్పాటు చేసిన హైలైఫ్ జువెల్స్ ఎగ్జిబిషన్ను ప్రముఖ నటి నిత్యా నరేశ్తో కలిసి హైలైఫ్ ఎగ్జిబిషన్ ఎండీ, చైర్మన్ అభయ్ పీ డొమినిక్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విభిన్న రకాల బంగారు ఆభరణాలను వినియోగదారులకు అందించేందుకు హైలైఫ్ ఎగ్జిబిషన్ వేదికగా నిలుస్తుందన్నారు. అనంతరం పలువురు మోడల్స్ బంగారు ఆభరణాలను ధరించి సందడి చేశారు. ఈనెల 16వ తేదీ వరకు ఎగ్జిబిషన్ కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు.