సిటీ క్రిమినల్ కోర్టులు, నాంపల్లి, జూలై 31(నమస్తే తెలంగాణ): కరోనా వైరస్ నేపథ్యంలో హైదరాబాద్, రం గారెడ్డి జిల్లాల పరిధిలోని అన్ని కోర్టులు సెప్టెంబర్ 9 వరకు ఫేజ్-1 ప్రకారం, పాక్షికంగానే నడుస్తాయని హై కోర్టు చీఫ్ జస్టిస్ హిమా కొహ్లీ ఉత్తర్వులు జారీ చేశారు. నాంపల్లిలోని ఏసీబీ, సీబీఐ, ఎం.పీ, ఎమ్మెల్యేల కోర్టుల్లో సైతం విచారణ లు కొనసాగుతాయి. ఫేజ్-1లో కేవలం ప్రతిరోజు 10-20 కేసుల విచారణ మాత్రమే జరుగుతుంది. ఆన్లైన్లో (వర్చువల్గా) కాకుండా భౌతికంగా కోర్టుల్లోనే విచారణ లు జరుగుతాయి. విచారణ జరిగే కేసుల్లో కోర్టు లకు నేరుగా హాజరయ్యేవారు కొవిడ్ వ్యాక్సినేషన్ వేయించు కున్నట్లు సర్టిఫికెట్లు చూపిస్తేనే కోర్టులోపలికి అనుమతి స్తారు. కేసుల విచారణకు సంబంధించి మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు నిందితులకు సమన్స్ పంపవచ్చు. సమన్స్ తీసు కొని కోర్టుకు రాని వాళ్లపై చట్టం ప్రకారం, కోర్టులు చర్యలు తీసుకోవచ్చన్నారు. కోర్టు పరిధిలో శానిటైజేషన్ ఎప్పటి కప్పుడు చేయించాల్సి ఉంటుంది. బార్ అసోసి యేషన్లో సామాజిక దూరం పాటించాలని హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.