హైదరాబాద్ : పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ను మోహరించారు. మీర్ చౌక్, గోషామహల్, చార్మినార్ ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. శాలిబండ నుంచి చాంద్రాయణగుట్ట వరకు పోలీసులు కవాతు నిర్వహించారు. ఓల్డ్ సిటీ సహా సౌత్ జోన్ పరిధిలో రాత్రి 8 గంటల్లోపు దుకాణాలు, హోటల్స్ మూసివేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. గుంపులు గుంపులుగా ఉన్న వారిని పోలీసులు చెదరగొడుతున్నారు. ఇక ఓల్డ్ సిటీకి వచ్చే రహదారులను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పలు చోట్ల ట్రాఫిక్ను మళ్లిస్తున్నారు. వదంతులు నమ్మొద్దంటూ పోలీసులు సూచించారు. ర్యాలీలు, ధర్నాలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. ర్యాలీలు నిర్వహిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.