చారిత్రక వారసత్వాన్ని కాపాడుకుందాం..
పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్కుమార్
చార్మినార్, ఏప్రిల్ 18 : చారిత్రక కట్టడాలను పరిరక్షించుకోవాలని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్కుమార్ తెలిపారు. సోమవారం అంతర్జాతీయ హెరిటేజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని దక్కన్ హెరిటేజ్ అకాడమీ, ఐకోమోస్ ఇండియా, తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో చారిత్రక చార్మినార్ వద్ద హెరిటేజ్ వాక్ను నిర్వహించారు. చార్మినార్ నుంచి చౌమహల్లా ప్యాలెస్ వరకు సాగిన హెరిటేజ్ వాక్ను అర్వింద్కుమార్ చార్మినార్ వద్ద జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పాతనగరంలో ఉన్న అనేక చారిత్రక ఆనవాళ్లను అభివృద్ధి పరుస్తూ వాటిని భవిష్యత్ తరాలకు అందించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.
సీపీపీ ప్రాజెక్ట్లో భాగంగా లాడ్బజార్లోని గాజుల మార్కెట్ పునరుద్ధరిస్తున్నామని, ఇందుకు ఢిల్లీకి చెందిన అబల్ అంబా సంస్థ ప్రత్యేక డిజైన్లను తయారు చేస్తున్నదని చెప్పారు. సర్దార్ మహల్ చరిత్ర కథలను శిల్పాల ఆకారంలో రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో వాయిదా పడిన హెరిటేజ్ వాక్ను తిరిగి ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో దక్కన్ హెరిటేజ్ అకాడమీ చైర్మన్ వేదకుమార్ ఆర్కియాలజీ హైదరాబాద్ సర్కిల్ సూపరింటెండెంట్ స్మితా ఎస్.కుమార్, టీఎస్టీడీసీ ఎండీ బి.మనోహర్, ఆర్కిటెక్ట్ సూర్యనారాయణ మూర్తి తదితరులు పాల్గొన్నారు.