బంజారాహిల్స్ : పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలకు అండగా నిలబడుతానని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పేర్కొన్నారు. ఖైరతాబాద్ డివిజన్కు చెందిన టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కే.వరప్రసాద్ అనారోగ్యంతో బాధపడుతూ బంజారాహిల్స్లోని స్టార్ ఆస్పత్రిలో చేరిన విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే దానం నాగేందర్ గురువారం పరామర్శించారు. ప్రసాద్ ఆరోగ్యపరిస్థితిపై డాక్టర్లను ఆరా తీశారు.
మెరుగైన చికిత్సను అందించాలని వైద్యులను కోరారు. అత్యవసర పరిస్థితిలో ఎవరైనా కార్యకర్తలు ఆస్పత్రిలో చేరితే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని, వారికి కావాల్సిన సాయం అందేలా చూస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీఆర్ఎస్ నాయకులు మహేందర్బాబు, కే.నాగేశ్వర్రావు, అంథోనీ. సంతోష్. సర్ఫరాజ్. సంతోష్. వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.