ఖైరతాబాద్, మార్చి 19 : పర్యాటక రంగంలో విశిష్టత కలిగిన ప్రాంతంగా విరాజిల్లుతున్న కేరళలో ‘స్కై ఎస్కేప్స్’ పేరుతో హెలీ టూరిజాన్ని ప్రవేశపెడుతున్నామని కేరళ పర్యాటక శాఖ సమాచార విభాగం అధికారి ఎండీ సలీం తెలిపారు. సోమాజిగూడలోని ది పార్క్ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో తొలి సమగ్ర ‘హెలీ టూరిజం’ పాలసీని తీసుకువచ్చిన తొలి రాష్ట్రంగా కేరళ నిలుస్తుందన్నారు.
ఈ నెల 14 నుంచి 17వ తేదీ వరకు పారా ైగ్లెడింగ్ ఫెస్టివల్ను నిర్వహించామని, 29 నుంచి 31 వరకు వర్కాలలో ఇంటర్నేషనల్ సర్ఫింగ్, మెగా మౌంటెన్ బైకింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. 25 నుంచి 28వ తేదీ వరకు మలబార్ ఇవర్ ఫెస్టివల్ను సైతం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.