హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలోని పీవీ నరసింహారావు ఎక్స్ప్రెస్వే పై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 6 కిలోమీటర్లకు పైగా వాహనాలు ఆగిపోయాయి. మెహిదీపట్నం నుంచి ఆరాంఘర్ వరకు వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎయిర్పోర్టుకు వెళ్లాల్సిన ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ట్రాఫిక్ను క్లియర్ చేసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.