సిటీబ్యూరో, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ): బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఆదివారం నాటికి బలహీనపడిందని, దీంతో ప్రస్తుతానికి నగరంలో భారీ వర్షాల ముప్పు తప్పినట్లేనని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. అయితే బలహీనపడిన ఆవర్తన ప్రభావం వల్ల నగరంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలున్నట్లు చెప్పారు.
ఆదివారం రాత్రి రాత్రి 10గంటల వరకు ఆసిఫ్నగర్, మెహిదీపట్నం, మౌలాలి, లంగర్హౌస్ తదితర ప్రాంతాల్లో 1.0 సెం.మీల వర్షపాతం నమోదైనట్లు టీజీడీపీఎస్ అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉండగా ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 27.0 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 21.5 డిగ్రీలు, గాలిలో తేమ 81శాతంగా నమోదైనట్లు అధికారులు తెలిపారు. వెల్లడించారు.