అల్వాల్ సర్కిల్లో 420 మంది కార్మికుల సేవలు
అనారోగ్యం బారినపడకుండా హెల్త్కిట్లు
తరచూ పర్యవేక్షిస్తున్న సూపర్వైజర్లు
మల్కాజిగిరి, ఏప్రిల్ 10: పారిశుధ్య కార్మికుల ఆరోగ్యానికి ప్రభుత్వం భరోసా ఇస్తుంది. వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ.. వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా రక్షణ కవచాలు అందజేస్తున్నది.. ప్రతి రోజు కార్మికుల ఆరోగ్యస్థితిని సూపర్ వైజర్లు అడిగి తెలుసుకుంటున్నారు. జ్వరంతో పాటు ఇతర ఆరోగ్య సమస్య లు ఉంటే వెంటనే వారిని అల్కాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పంపిస్తున్నారు. అల్వాల్ సర్కిల్ పరిధిలో 186కాలనీలు, 37బస్తీల్లో దాదాపు 43,580ఇండ్లు, అపార్టుమెంట్లలో మూడు లక్షల మంది నివసిస్తున్నారు. సర్కిల్ పరిధిలోని మూడు డివిజన్లలో 420మంది పారిశుధ్య కార్మికులు పనిచేస్తున్నారు. వ్యాధులు కార్మికులకు రాకుండా ముందస్తుగా వారికి హెల్త్ కిట్లను అందజేశారు. కిట్లో శానిటైజర్, సబ్బులు, గ్లౌజులు, షూస్, మాస్కులు, రాత్రి సమయాల్లో మెరిచే టౌజర్లు అందజేశారు.
పారిశుధ్య కార్మికుల ఆరోగ్య రక్షణకు కృషి
పారిశుధ్య కార్మికుల ఆరోగ్యాన్ని కాపాడడానికి కృషి చేస్తున్నాం. అల్వాల్ సర్కిల్ పరిధిలో పనిచేస్తున్న 420మంది పారిశుధ్య కార్మికుల ఆరోగ్య రక్షణ కోసం హెల్త్ కిట్లను అందజేశాం. వారు వాటిని ఉపయోగించే మాదిరిగా అధికారులు అవగా హన కల్పిస్తున్నారు. ఆరోగ్య సమస్యలు ఉన్నవారిని గుర్తించి వైద్య చికిత్సల కోసం పంపిస్తున్నాం. ప్రజలు పారిశుధ్య కార్మికులకు సహకరించాలి. చెత్తను రోడ్లవెంట వేయవద్దు… ప్రభుత్వం అందజేసిన తడి-పొడి బుట్టల్లో వేసి ఉదయాన్నే కాలనీలకు వచ్చే ఆటోట్రాలీల్లో వేయాలి. కొత్త ఆటో ట్రాలీలను అందజేయడానికి కృషిచేస్తాం. – మైనంపల్లి హన్మంతరావు, ఎమ్మెల్యే