మణికొండ, జనవరి 25 : అతివేగంతో దూసుకొచ్చిన కారు.. ఓ ద్విచక్రవాహనదారుడిని ఢీకొట్టడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. నార్సింగి పోలీసుల కథనం ప్రకారం.. సంగారెడ్డి జిల్లా రాంచంద్రాపురం మండలం వెలిమల గ్రామానికి చెందిన రవి(43) ద్విచక్రవాహనంపై ఎల్బీనగర్కు వెళ్లి వస్తుండగా.
పుప్పాలగూడ సమీపంలో వెనుక నుంచి అతివేగంగా దూసుకువచ్చిన కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రవి దుర్మరణం పాలయ్యాడు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని అరెస్టు చేసి, హిట్ అండ్ రన్ కేసును నమోదు చేసినట్లు సీఐ సతీశ్ తెలిపారు.