ఖైరతాబాద్, మార్చి 18: తాను మరణిస్తూ అవయవదానం ద్వారా జీవించాడు. రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లికి చెందిన బిస్వాల్ ప్రభాకర్, పింకీ దంపతుల కుమారుడు బిస్వాల్ ప్రభాస్ (19). ఈ నెల 14న ఆటో ఢీకొట్టగా తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు గచ్చిబౌలిలోని కాంటినెంటల్ దవాఖానకు తరలించారు. చికిత్స అందిస్తున్న వైద్యులు ఈ నెల 17న బ్రెయిన్ డెడ్గా నిర్ధారించారు. కుటుంబ సభ్యులను కలిసిన జీవన్దాన్ ప్రతినిధులు.. అవయవదానం విశిష్టతను వివరించగా, అందుకు వారు అంగీకరించారు. బిస్వాల్ ప్రభాస్ శరీరం నుంచి కాలేయం, రెండు మూత్రపిండాల సేకరించారు.