Medchal | మేడ్చల్ మల్కాజ్గిరి : దుండిగల్ పోలీసు స్టేషన్ పరిధిలో హ్యాష్ ఆయిల్ విక్రయిస్తున్న ఓ యువకుడిని బాలానగర్ ఎస్వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ యువకుడి వద్ద రూ. 75,200 విలువ చేసే 94 గ్రాముల హ్యాష్ ఆయిల్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆయిల్ను హిమాచల్ప్రదేశ్ నుంచి తీసుకొచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఒక్కో గ్రామును రూ. 8 వేలకు కాలేజీ విద్యార్థులకు విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
నిందితుడు కనగల ఉదయ్ కుమార్(29) వృత్తి రీత్యా డాగ్ బ్రీడర్ అని తేలింది. దుండిగల్ పరిధిలోని మల్లంపేట్ ఎస్సార్కే హోమ్స్లోని విల్లా నెంబర్ 12లో నివాసముంటున్నట్లు పేర్కొన్నారు. ఉదయ్ నుంచి డిజిటల్ వెయిటింగ్ మెషీన్, రూ. 11 వేల నగదు, మొబైల్ ఫోన్ను సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.