కుత్బుల్లాపూర్, మార్చి 31 : హాష్ ఆయిల్ విక్రయించేందుకు యత్నించిన ఓ ముఠాను బాలానగర్ ఎస్ఓటీ, మేడ్చల్ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి సుమారు రూ.11 లక్షల విలువ చేసే హాష్ ఆయిల్తో పాటు ద్విచక్ర వాహనం, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించారు. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మేడ్చల్ జోన్ ఇన్చార్జి డీసీపీ శ్రీనివాస్రావు వివరాలు వెల్లడించారు. ఏపీ విశాఖపట్నం ప్రాంతానికి చెందిన గొల్లు కుమారస్వామి(21) గత కొన్నెళ్ల కిందట నగరానికి వలస వచ్చి గండిమైసమ్మ ప్రాంతంలోని కోల్టాస్ ఫార్మా కంపెనీలో మెకానిక్గా పని చేస్తున్నాడు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బును సంపాదించాలనే అత్యాశతో మార్కెట్లో గంజాయి, హాష్ ఆయిల్కు డిమాండ్ ఉందని తెలుసుకున్నాడు.
ఈ రంగంలో గతంలో నేరస్తుడైన విశాఖపట్నంకు చెందిన తన స్నేహితుడైన కోడి అజయ్ కుమార్కు ఫోన్ చేసి తనకు హాష్ ఆయిల్ కావాలని, అందుకు తూనిలోని నాగేశ్వరరావు అలియాస్ నాగు నుంచి తీసుకురావాలని సూచించాడు. దీంతో అజయ్ తన మరో ఇద్దరు స్నేహితులైన లోకవరపు స్వామి, గణేశ్లతో కలిసి ఈ నెల 29న పల్సర్ బైక్కు నగరానికి దిగుమతి చేసుకున్నారు. ఈ నెల 30న దానిని చిన్నచిన్న ప్యాకెట్లలో వేర్వేరు చేసి కావాల్సిన వారికి ఇచ్చేందుకు గండిమైసమ్మ ఏరియా ప్రాంతానికి చెందిన విక్రయదారుడు మిత్ కుమారస్వామిని కలుసుకొనేందుకు కుమారస్వామి, స్వామిగణేశ్, కోడి విజయ్కుమార్, ముగ్గురు కలిసి హాష్ ఆయిల్ను తమ ద్విచక్ర వాహనంలో పెట్టుకొని వెళ్తుండగా మార్గమధ్యలో అప్పటికే ఎస్ఓటీ టీం పోలీసులు మేడ్చల్ చెక్పోస్టు వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా వారికి పట్టుబడ్డారు. వారి వద్ద లభించిన హాష్ ఆయిల్ను, బైక్తో పాటు మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించినట్లు తెలిపారు.