హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ‘హర్ ఘర్ ఫ్రీడమ్ సేల్’ ఆఫర్ ప్రకటించింది. సంప్రదాయ, ఆధునిక ఫ్యాషన్ బ్రాండెడ్ మెన్స్వేర్, ఉమెన్స్వేర్, కిడ్స్వేర్పై 75 శాతం డిస్కౌంట్ ఇస్తున్నది.
ప్రతి గ్రాము బంగారం కొనుగోలుపై ఒక గ్రాము వెండి ఉచితంగా, స్టోన్ చార్జీలపై, అన్ని రకాల రత్నాల ఆభరణాలపై 20 శాతం తగ్గింపు ప్రకటించింది. ‘హర్ ఘర్ ఫ్రీడమ్ సేల్’ ఆఫర్ను వినియోగించుకోవాలని శనివారం సంస్థ ఆ కోరింది.