సిటీబ్యూరో, జూలై 6(నమస్తే తెలంగాణ): అమ్మాయిలు మాట్లాడకపోతే.. రోజుకు 2వేల సార్లు ఫోన్లు చేసి సతాయిస్తున్న ఓ యువకుడిని రాచకొండ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్నగర్, పాల్సబ్గుట్ట గ్రామానికి చెందిన పీట్ల సంతోష్ ఇంజినీరింగ్ చదివాడు.. మ్యాట్రిమోని వెబ్సైట్లలో అమ్మాయిల ప్రొఫైల్స్ చూసి.. వారికి ఫోన్ చేసి.. తను ఓ సెలబ్రిటీగా, టీవీ సీరియల్ ఆర్టిస్ట్గా పరిచయం చేసుకుంటాడు. నెల కు రూ.70 వేలు సంపాదిస్తున్నానని.. పరిచయమైన కొద్ది రోజుల్లోనే వారికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మిస్తాడు. ఈ విధంగా ఓ అమ్మాయి అతని ట్రాప్లో పడి.. మోసపోయి అతడిని దూరంపెట్టింది. దీంతో ఆమెకు రోజుకు 1500 నుంచి 2 వేల సార్లు ఫోన్లు చేసి సతాయిస్తున్నాడు. ఎంతకీ ఆమె స్పందించకపోవడంతో.. ఆమెకు తెలిసినవారికి మాట్లాడమని మెసేజ్లు పెట్టాడు.. దీంతో బాధితురాలి సమీప బంధువు అతడితో ఫోన్లో మాట్లాడగా.. మీ అబ్బాయికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి.. ఆమె నుంచి దాదాపు 3.03 లక్షలు తీసుకుని..ఫోన్ స్విచాఫ్ పెట్టాడు. బాధితురాలి ఫిర్యాదుతో రాచకొండ సైబర్ క్రైం పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టి.. నిందితుడు సంతోష్ను మంగళవారం అరెస్ట్ చేశారు.