ఉప్పల్, డిసెంబర్ 27 : ఆపదలో ఉన్నవారికి అండగా నిలిచి, వారికి తగిన చేయూతనందిస్తున్నామని నాచారం డివిజన్ కార్పొరేటర్, జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ మెంబర్ శాంతిసాయిజెన్ శేఖర్ అన్నారు. నాచారం అంబేద్కర్నగర్లో నివసించే మహిళ ఇటీవల జరిగిన ప్రమాదంలో గాయపడి, కాళ్లు పోగొట్టుకుంది. విషయం తెలుసుకున్న కార్పొరేటర్ మంగళవారం వారి ఇంటికి వెళ్లి కుటుంబాన్ని పరామర్శించి, యూట్యూబర్ వేదాంత్ జాక్సన్తో కలిసి రూ.10 వేల ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో నేతలు సాయిజెన్ శేఖర్, రామకృష్ణ, అంజి, అశోక్, నర్సింగ్రావు, హరిప్రసాద్, కట్ట బుచ్చన్నగౌడ్, చంద్రశేఖర్ పాల్గొన్నారు.
భూగర్భ డ్రైనేజీ పనుల పరిశీలన..
నాచారం డివిజన్ సావర్కర్నగర్లో జరుగుతున్న భూగర్భ డ్రైనేజీ పనులను మంగళ వారం కార్పొరేటర్ శాంతిసాయిజెన్ శేఖర్ పరిశీలించారు. ఈ మేరకు కాలనీవాసుల నుంచి సమస్యలు తెలుసుకున్నారు. వరదనీటి సమస్యలు లేకుండా చూస్తామని, డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కార చర్యలు చేపడుతామన్నారు. ఈ కార్యక్రమంలో డీఈ రూప, వర్క్ఇన్స్పెక్టర్ విజయ్కుమార్, నేతలు సాయిజెన్ శేఖర్, మధుసూదన్రెడ్డి, రాంరెడ్డి, లక్ష్మారెడ్డి, శ్రీశైలం, ఈశ్వర్ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.