హైదరాబాద్ : మొయినాబాద్(Moinabad) యువతి మిస్సింగ్ ఘటన పై సౌత్ జోన్ డీసీప సీరియస్ అయ్యారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన హబీబ్నగర్ ఎస్ఐ శివ(SI Shiva) సస్పెండ్( suspended) చేశారు. అలాగే ఇన్స్పెక్టర్ రాంబాబుకు చార్జ్ మెమో జారీ చేశారు. కాగా, హబీబ్ నగర్(Habib Nagar )లో యువతి మిస్సింగ్ విషయంలో కేసు నమోదు చేయని పోలీసులపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ సీపీ శ్రీనివాస్ రెడ్డి(CP Srinivas Reddy) తెలిపారు. ఈ నెల 8వ తేదీన హబీబ్ నగర్లో యువతి మిస్సింగ్(Missing case) అవగా పదో తేదీన యువతి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
అయితే కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసినా పోలీసులు ఈ రోజు వరకు కేసు నమోదు చేయలేదు. దీంతో శుక్రవారం సీపీ స్వయంగా హబీబీనగర్ పోలీస్ స్టేషన్కు వెళ్లి కేసు వివరాలను పరిశీలించారు. పోలీసుల నిర్లక్ష్యంపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని, మళ్లీ ఇలాంటి పొరపాటు జరగకుండా చూస్తామని హామీనిచ్చారు. కాగా, మొయినాబాద్లో చనిపోయిన యువతి హబీబ్ నగర్ చెందిన యువతీగా గుర్తించారు. ఈ నేపథ్యంలో విచారణను వేగవంతం చేసి నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్ఐ శివను సస్పెండ్ చేశారు.