మణికొండ, జూలై 4: మనిషి జీవితంలో విద్యను మించినది మరొకటి లేద ని, దీంతోనే వికాసం ఉంటుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పు ల ఈశ్వర్ పేర్కొన్నారు. ప్రధానంగా మహిళలు చదువుకుంటే కుటుంబంతో పాటు సమాజం, తర్వాత దేశం మరింతగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. శివారు ప్రాంతంలోని నార్సింగి సాంఘిక సంక్షేమ గురుకుల హాస్టల్లో గురువారం ఆయన ‘తుంబి’ అనే పిల్లల మాస పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ పేద వర్గాల వారికి ఇంగ్లిష్ మీడియంలో నాణ్యతా ప్రమాణాలతో కూడిన ఉచిత విద్యను అందించాలనే దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద సంఖ్యలో గురుకులాల ను నెలకొల్పారని అన్నారు.
గురుకులాల్లో చదువుతున్న మారుమూల గ్రామీణ ప్రాంతాలకు చెందిన బాల బాలికలు ఇంగ్లిషులో అనర్గళంగా మాట్లాడటం, అత్యుత్తమ ఫలితాలు సాధిస్తుండటం సంతోషంగా ఉందన్నారు. మహానీయుల జీవిత చరిత్ర, విజయగాథలు, నీటి కథలు, పెయింటింగ్స్ కార్టూన్స్తో కూడిన ఈ ‘తుంబి’ మాస పత్రిక వంటి మ్యాగజైన్ను మన గురకుల విద్యార్థులు కూ డా తీసుకువస్తే బాగుంటుందన్నారు. మనిషి ప్రకృతితో కలిసి ముందుకు సాగాలని, పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన గురుతర బాధ్యతను ఈ తుంబి గుర్తు చేస్తున్నదన్నారు. ఎస్సీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ కార్యదర్శి రోనాల్డ్ రాస్ మాట్లాడుతూ ఈ విద్యా సంస్థల్లో చదువుకున్న వాళ్లు దేశ విదేశాలలో గొప్పగా స్థిరపడుతున్నారని, ఇటీవలే నలుగురు విద్యార్థులు అమెరికా వెళ్లారని గుర్తుచేశారు. విద్యార్థులతో మంత్రి సహ పంక్తి భోజనం చేశారు. కార్యక్రమంలో సాం స్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, కౌన్సిలర్ పత్తి ప్రవీణ్ కుమార్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, అధికారులు పాల్గొన్నారు.