హైదరాబాద్ : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి సతీమణి సీత రంజిత్ రెడ్డి గ్రీన్ ఇండియా చాలెంజ్లో పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఆలయ సభ్యులతో కలిసి జమ్మి మొక్కను నాటారు.
ఈ సందర్భంగా సీత రంజిత్ రెడ్డి మాట్లాడుతూ..ఎంపీ సంతోష్ కుమార్ పిలుపు మేరకు మహిళా దినోత్సవం సందర్భంగా జమ్మి మొక్క నాటామని తెలిపారు. ప్రతి ఒక్క మహిళ మొక్కలు నాటాలని కోరారు.మొక్కలు నాటడం మనందరి బాధ్యత అని గుర్తుచేశారు. కార్యక్రమంలో జూబ్లీహిల్స్ టిటిడి కమిటీ సభ్యులు,సినీ నటి రీతూ వర్మ పాల్గొన్నారు.