సిటీబ్యూరో, మార్చి 23 (నమస్తే తెలంగాణ): సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులతో సమన్వయం చేసుకుంటూ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేసిన గ్రీన్ చానల్లో భాగంగా లైవ్ ఆర్గాన్స్ను శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి సికింద్రాబాద్కు 27 నిమిషాల్లో అంబులెన్స్లో తరలించారని ట్రాఫిక్ అదనపు సీపీ సుధీర్బాబు తెలిపారు.
ఎయిర్ పోర్టు నుంచి ఉదయం 10.58 నిమిషాలకు లైవ్ ఆర్గాన్(లంగ్స్)తో బయలుదేరిన అంబులెన్స్ 11.25 నిమిషాలకు సికింద్రాబాద్లోని కిమ్స్కు చేరుకుంది. గ్రీన్ చానల్ ఏర్పాటు చేసిన ట్రాఫిక్ పోలీసులకు దవాఖాన యాజమాన్యం కృతజ్ఞతలు తెలిపింది. ఈ ఏడాది ఇప్పటి వరకు 5 సార్లు గ్రీన్ చానల్ ఏర్పాటు చేసి లైవ్ ఆర్గాన్స్ తరలించినట్లు అదనపు సీపీ తెలిపారు.