రాష్ట్ర పదో అవతరణ దినోత్సవాన్ని సంబురంగా జరుపుకొనేందుకు గ్రేటర్ ముస్తాబైంది. నేటి నుంచి 22వ తేదీ వరకు దశాబ్ది ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
ఉత్సవాల్లో భాగంగా విశ్వనగరంగా హైదరాబాద్ను రూపుదిద్దేందుకు ప్రభుత్వం చేసిన కృషిని ప్రజలకు తెలియజేసేలా కార్యక్రమాలు, ప్రతి రంగం విజయాలన్నీ ప్రతిబింబించేలా వేడుకలు జరుగనున్నాయి. ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని తొలిరోజు శుక్రవారం నగరవ్యాప్తంగా జాతీయ జెండాల ఆవిష్కరణ, ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. – సిటీబ్యూరో, జూన్ 1(నమస్తేతెలంగాణ)