అబిడ్స్, డిసెంబర్ 23 : క్రిస్మస్ సందర్భంగా క్రీస్తు శాలం సోషల్ వెల్ఫేర్ క్రిస్టియన్ సొసైటీ అధ్యక్షుడు జె. జోసెఫ్, గడ్డం గంగాధర్ యాదవ్ ఫౌండేషన్ చైర్మన్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గడ్డం శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి గన్ఫౌండ్రి డివిజన్లోని పూల్బాగ్ మైదానంలో క్రైస్తవ సోదరులతో కలిసి మినీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి గడ్డం శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి మినీ క్రిస్మస్ వేడుకలను ప్రారంభించారు.ఈ సందర్భం గా నిర్వాహకులు శ్రీనివాస్ యాదవ్ను సన్మానించారు. కార్యక్రమంలో బి. భాస్కర్, కాంతమ్మ, సదానంద్, వినోద్కుమార్, డాక్టర్ ఆనంద్రావు, క్రైస్తవులు పాల్గొన్నారు.
నిజాం కళాశాలలో.. క్రిస్మస్
నిజాం కళాశాలలో క్రిస్మస్ వేడుకలను నిర్వహించారు. శుక్రవారం కళాశాల ఆడిటోరియంలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ భీమా భూక్యా క్రిస్టియన్ సోదరి, సోదరులతో కలిసి కేక్ కట్ చేసి సంబురాలను జరుపుకున్నారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సీవీ రంజని, హాస్టల్స్ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ బాలబ్రహ్మచారి, ఇంగ్లిష్ డిపార్ట్మెంట్ హెడ్ డాక్టర్ మెలిసా హెలెన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డైరెక్టర్ డాక్టర్ సాంబశివ, బోధన, బోధనేతర ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నా రు.
దైవమార్గమే ఉత్తమ మార్గం
పురానాపూల్ పార్ధివాడలో శుక్రవారం సెమీ క్రిస్మస్ వేడుకలను నిర్వహించారు. ఓల్డ్సిటీ చర్చిస్ కన్వీనర్ కనాన్చర్చ్ ఫెలోషిఫ్ వర్షిఫ్ మినిస్ట్రీ అధ్యక్ష, కార్యదర్శులు బుర్రగల నందం, సంధ్య ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించారు. పాస్టర్ శ్యాముల్ దివాకర్ మాట్లాడుతూ.. ప్రభువు పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చిన సంరక్షకుడని తెలిపారు. కార్యక్రమంలో సంఘం కార్యకర్తలు, సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు.
క్రిస్మస్కు చర్చ్లు ముస్తాబు
నాంపల్లి, కార్వాన్ నియోజకవర్గాల్లో చర్చ్లు ముస్తాబు చేశారు. చర్చ్ల్ల్లో ప్రత్యేక ప్రార్థనలు, సంగీత విభావరి, సాంస్కృతిక నాటిక ప్రదర్శనలు ఇవ్వడానికి నిర్వాహకుల సర్వం సిద్ధం చేశారు. మాసాబ్ట్యాంక్, రెడ్హిల్స్, ఆసిఫ్నగర్, మెహిదీపట్నం, గుడిమల్కాపూర్, అహ్మద్నగర్, కార్వాన్ నియోజకవర్గం లంగర్హౌస్, నానల్నగర్, టోలిచౌకి ప్రాంతాల్లోని చర్చ్లను విద్యుత్ దీపాలతో అలంకరించారు. ప్రభుత్వం తరుఫున అందజేస్తున్న క్రిస్మస్ కానుకలను సంబంధిత చర్చ్ల ప్రతినిధుల ద్వారా క్రైస్తవులకు అందించడం పూర్తి అయ్యిందని అధికారులు తెలిపారు.
ప్రశాంతంగా జరుపుకోవాలి
ప్రశాంత వాతావరణంలో క్రిస్మస్ పండుగ జరుపుకోవాలని జియాగూడ మాజీ కార్పొరేటర్ మిత్రకృష్ణ అన్నారు. శుక్రవారం డివిజన్ పరిధిలోని లక్ష్మీనర్సింహ నగర్ బీఆర్ఎస్ కార్యాలయం వద్ద పాస్టర్ల సమక్షంలో క్రిస్మస్ సంబురాలను మాజీ కార్పొరేటర్ మిత్రకృష్ణ, రాష్ట్ర నాయకుడు కావురి వెంకటేశ్తో కలిసి ప్రారంభించారు. క్రిస్మస్ కానుకల పంపిణీ అనంతరం క్రైస్ట్ నీస్సీ చర్చి పాస్టర్ రాజ్కుమార్, వివిధ చర్చీల పాస్టర్లను సన్మానించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు నరహరిచారి, యూత్ నాయకులు సందీప్లాల్ యాదవ్, ఉమేశ్, కేశవ్, మహిళ నాయకురాలు అనిత పాల్గొన్నారు.
శ్లోకా – ది -స్కూల్లో.. సంబురాలు
శాంతినగర్లోని శ్లోకా – ది – స్కూల్లో క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని శుక్రవారం ప్రిన్సిపాల్ నాగేశ్వర్రావు, వైస్ ప్రిన్సిపాల్ అమిత పాఠశాల ఆవరణలో విద్యార్థులతో కలిసి సంబురాలు నిర్వహించారు. కార్యక్రమంలో డైరెక్టర్ తిరుమల్రావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.