సిటీబ్యూరో, జనవరి 26 (నమస్తే తెలంగాణ): తెలంగాణ, కేరళ, ఒడిశా, పంజాబ్, పశ్చిమ బెంగాల్ ఇలా 29 రాష్ర్టాల భిన్న సంస్కృతులు.. ఒక్కటే వేడుక. భిన్నత్వంలో ఏకత్వం ఉట్టిపడినవేళ.. 74వ భారత గణతంత్ర వేడుకలను నగరంలోని పెబెల్ సిటీ (దేశంలోని 29 రాష్ర్టాలకు చెందిన ప్రజలు నివసిస్తున్నారు)లో గురువారం ఘనంగా నిర్వహించారు.
పెబెల్ సిటీవాసులు నిర్వహించిన ప్రదర్శనలు దేశ రాజధానిలో నిర్వహించే గణతంత్ర పరేడ్ను తలపింపజేశాయి. ఈ మినీ పరేడ్లో ఉపయోగించిన వస్తువులు, సామగ్రి మొత్తం పర్యావరణ హితంతో కూడుకున్నవేనని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా రన్నింగ్, వాలీబాల్, క్రికెట్, బ్యాడ్మింటన్ వంటి క్రీడల్లో 100మందికి పైగా సీనియర్ సిటిజన్లు పాల్గొన్నారు.