వినాయక్ నగర్: ఓల్డ్ అల్వాల్లోని జొన్నబండ ఉమామహేశ్వరస్వామి దేవాలయంలో కార్తీక మాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి. శివునికి ప్రీతికరమైన కార్తీక సోమవారం సందర్భంగా స్వామికి ప్రత్యేక మహాకాల రుద్రాభిషేకం, ఏకబిల్వ, అఖండ బిల్వ, సహిత లక్ష పుష్పాభిషేకం నిర్వహించారు. ఏకబిల్వ చెట్టును పూజించి, దేవాలయ ఆవరణలో ప్రతిష్ఠించినట్టు ఆలయ చైర్మన్ కొడారి నర్సింగరావు, ఆలయ ప్రధాన అర్చకుడు విరివెంటి రాజశేఖర్ శర్మ తెలిపారు.