మున్సిపల్ కాలనీలో,ఫుతుల్లాగూడలో బస్తీ దవాఖానకు ఎమ్మెల్యే శంకుస్థాపన
మన్సూరాబాద్/ఎల్బీనగర్, మార్చి 31: తెలంగాణ ప్రభుత్వం పేదలకు వైద్యాన్ని చేరువ చేస్తోందని ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. గురువారం ఉదయం చైతన్యపురి డివిజన్లోని మున్సిపల్ కాలనీలో ,నాగోల్ డివిజన్ బండ్లగూడ పరిధిలోని ఫతుల్లాగూడ సర్వేనం. 58, 59లో బస్తీ దవాఖానల నిర్మాణానికి కార్పొరేటర్లు రంగా నర్సింహగుప్త,అరుణతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్ర మంలో ఎమ్మెల్యే సుధీర్రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ దవా ఖానల్లో అధునాతన సౌకార్యలను కల్పించడంతో పాటు గా బస్తీల్లోకే వైద్య సేవలను తీసుకుని వచ్చి బస్తీ దవాఖానలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నదన్నారు.
పేదలకు అన్ని రకాలైన వైద్య పరీక్షలు ఉచితంగా అందించేందుకు బస్తీ దవాఖానలు ఉపయోగపడుతాయన్నారు. నియోజకవర్గ ప్రజలకు త్వరలోనే అధునాతన మల్లీస్పెషాలిటీ దవాఖాన కూడా అందుబాటులోకి రానున్నదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు మహేశ్ యాదవ్, కర్మన్ఘాట్ హనుమాన్ ఆలయ మాజీ చైర్మన్ నర్సిరెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చంద్రశేఖర్రెడ్డి, వినోద్యాదవ్, నాగలక్ష్మి, జ్యోతి, జయశ్రీ, వెంకటేశ్, నరేశ్, హరిబాబు, మోహన్రాజ్, చిన్నా యాదవ్, నజీర్ , శ్రీహరి, జలందర్, ఉదయ్, కృష్ణ, శ్రీనివాస్, శ్రీశైలం, బండ్లగూడ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు చిరంజీవి, నాయకులు రాజిరెడ్డి, ప్రశాంత్గౌడ్, కృష్ణ,జంగయ్య గౌడ్, శ్యామల యాదగిరి, పెద్దులు, రాఘవేందర్ గౌడ్, సీతారాములు, కవిత, సుశీల, రంగేశ్వరి, పారిజాత, ఎల్లయ్య, శంకర్, నారాయణమ్మ తదితరులు పాల్గొన్నారు.