వెంగళరావునగర్, జూన్ 26: కరోనా థర్డ్వేవ్ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సూచించారు. శనివారం వెంగళరావునగర్లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్ ఆవరణలో నూతనంగా ప్రారంభించిన కొవిడ్ కమాండ్ సెంటర్, కాల్ సెంటర్లను గవర్నర్ తమిళిసై సందర్శించారు. ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో గవర్నర్ మాట్లాడుతూ…కరోనాను ఎదుర్కొనేందుకు ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టినందుకు రాష్ట్ర ప్రభుత్వం, ఐటీ, ఆరోగ్య శాఖను ఆమె అభినందించారు. కమాండ్ సెంటర్ ద్వారా రోగ తీవ్రత, దవాఖానల్లో పడకలు, ఆక్సిజన్ లభ్యతను ఎప్పటికప్పుడు మానిటర్ చేయవచ్చని పేర్కొన్నారు. కరోనా కట్టడిలో వైద్య సిబ్బంది చేస్తున్న సేవలను గవర్నర్ ప్రశంసించారు.