చర్లపల్లి, డిసెంబర్ 22 : క్రిస్మస్ సందర్భంగా ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని చర్చిల వద్ద సౌకర్యాలు కల్పిం చేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. ఏఎస్రావునగర్ డివిజన్ పరిధిలోని భవానీనగర్ డివైన్ గ్రేస్ లూథరస్ చర్చిలో గురువారం నిర్వహించిన సెమి క్రిస్మస్ వేడుకలకు ఎమ్మెల్యే హాజరై.. క్రైస్తవ సోదరులకు ప్రభుత్వం అందజేసే క్రిస్మస్ కానుకలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా క్రైస్తవుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని, అన్ని వర్గాలు, మతాలను గౌరవించి పేదవారికి పథకాలను అందజేసే విధంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. అనంతరం చర్చి పాస్టర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను సన్మానించారు.
ఈ కార్యక్రమంలో చర్చి పాదర్లు శ్యాంసుందర్, భూపేందర్, విన్స్బాబు, కాలనీ మాజీ అధ్యక్షుడు కొత్త అంజిరెడ్డి, మాజీ కార్పొరేటర్ ధన్పాల్రెడ్డి, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు కాసం మహిపాల్రెడ్డి, కుమారస్వామి, నాయకులు గరిక సుధాకర్, శేర్ మణెమ్మ, బేతా ల బాల్రాజు, సుడుగు మహేందర్రెడ్డి, కందుల లక్ష్మీనారాయణ, ఏనుగు సీతారామిరెడ్డి, రాంచందర్గౌడ్, నాగేశ్వర్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, సింగపాల శ్రీనివాస్, శివ, జయకృష్ణ, సంపత్, మొగులయ్య, యాదగిరి, అండ్రూస్, చిన్నారావు, లక్ష్మీనారాయణ, నందికంటి శివ, రమాదేవి, మంజుల, శిరీషారెడ్డి, రహీం పాల్గొన్నారు.