ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్
సిటీబ్యూరో, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో స్టార్టప్ల అభివృద్ధికి అనుకూలమైన వాతావరణాన్ని పెంపొందించేందుకు సర్కారు కృషి చేస్తున్నదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ కేంద్రంగా ఉన్న టీ హబ్ను 40 మంది రాష్ట్ర ప్రభుత్వ సీనియర్ ఐఏఎస్ అధికారుల బృందం మంగళవారం సందర్శించింది. ఈ సందర్భంగా టీహబ్లోని పలు ఇన్నోవేషన్ కేంద్రాలను సందర్శించి వారు రూపొందించిన పలు ఆవిషరణలను పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన ఇన్నోవేషన్స్ వర్షాప్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ మాట్లాడుతూ.. సమర్థత, జవాబుదారీతనం, పారదర్శకతను పెంచడమే కాకుండా ప్రభుత్వ శాఖల పనితీరును మెరుగుపరచడంలో కూడా ఈ నూతన ఆవిషరణలు సహాయపడతాయన్నారు. పాఠశాల స్థాయి నుంచే పిల్లల్లో సాంకేతిక స్ఫూర్తిని పెంపొందించాలని, తద్వారా వారు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని సులువుగా అందిపుచ్చుకోగలరని పేర్కొన్నారు.
వందకు పైగా ఇన్నోవేషన్ ప్రోగ్రాంలు..
టీ హబ్ ఇప్పటివరకు వందకు పైగా ఇన్నోవేషన్ ప్రోగ్రాంలను అందించిందని, స్టార్టప్లు మరియు ఇతర ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ వాటాదారులపై ప్రభావం చూపుతుందని ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తెలిపారు. 2000 కంటే ఎకువ జాతీయ, అంతర్జాతీయ స్టార్టప్లకు మెరుగైన సాంకేతికత, ప్రతిభ, సలహాదారులు, కస్టమర్లు, కార్పొరేట్, పెట్టుబడిదారులు మరియు ప్రభుత్వ ఏజెన్సీలకు అందించిందన్నారు. టీ హబ్ను ఏడేళ్ల క్రితం స్థాపించామని, వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్, హెల్త్ తదితర రంగాల్లో స్వల్ప వ్యవధిలో 260 స్టార్టప్లు 1.9 ట్రిలియన్ డాలర్ల వ్యాపారంతో పనిచేస్తున్నాయని తెలిపారు.రాష్ట్ర ఏర్పాటుకు ముం దు రెండు ఇన్నోవేషన్ సెంట ర్లు ఉండగా.. ఎనిమిదేండ్లలో వాటి సంఖ్య 63కి పెరిగిందని తెలిపారు. టీ హబ్కు వచ్చిన అద్భుతమైన స్పందన దృష్ట్యా రాష్ట్రంలో మహి ళా పారిశ్రామిక వేత్తల కోసం ప్రత్యేకంగా వీ హబ్ను ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణ రాష్ట్ర ఇన్నోవేషన్ కౌన్సిల్ గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాల విద్యార్థులలో వినూత్న ఆలోచనలను ప్రోత్సహిస్తోందని చెప్పారు. అలాగే లైఫ్ సైన్సెస్, ఫుడ్ , అగ్రికల్చర్ టెక్నాలజీ రంగాల్లో పరిశోధన, ఆవిషరణలను ప్రోత్సహించడానికి వివిధ విద్యా సంస్థల సహకారంతో రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సరిల్ ఆఫ్ హైదరాబాద్ ను 2017లో ప్రారంభించామన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, వివిధ శాఖల అధికారులు, పీసీసీఎఫ్లతో కలిసి ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.