మియాపూర్ , మార్చి 31 : వేసవిలో ఎక్కడా తాగునీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలతో అధికారులు సిద్ధంగా ఉండాలని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. ఇందుకోసం పైప్లైన్ల లీకేజీని పూర్తిస్థాయిలో అరికట్టి చుక్క నీరు వృథాగా పోకుండా చూడాలన్నారు. మియాపూర్ క్యాంపు కార్యాలయంలో బుధవారం జలమండలి అధికారులతో తాగునీటి విషయమై అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ.. మిషన్ భగీరథ పథకం కింద నియోజకవర్గవ్యాప్తంగా 18 రిజర్వాయర్లను నిర్మించుకుని ప్రతి గడపకు స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తున్నట్లు వెల్లడించారు. కోట్లాది రూపాయలు వెచ్చించి పైప్లైన్లను సైతం విస్తరించినట్లు, అయినప్పటికీ ఇంకా నెట్వర్క్ లేని , తాగునీరు కలుషితమయ్యే , పైపులైన్లు మార్చాల్సిన ప్రాంతాలను గుర్తించి తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. వేసవి సీజన్ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో సిబ్బంది అనునిత్యం అప్రమత్తంగా ఉం డేలా అధికారులు ఆదేశించాలని విప్ సూచించారు.
ఈ కార్యక్రమంలో జలమండలి డీజీ ఎం శ్రీమన్నారాయణ, మేనేజర్లు నిప్పర్తి, వెంకటరెడ్డి, యాద య్య పాల్గొన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధి వాణీదేవి విజయానికి కృషి చేసిన నాయకులను గచ్చిబౌలిలో టీఆర్ఎస్ శ్రేణులు బుధవారం ఘనంగా సన్మానించారు. ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ, తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీయుఎఫ్ఐడీసీ) చైర్మన్ విప్లవ్ కుమార్ ముఖ్యఅతిథులుగా హాజరై గచ్చిబౌలి డివిజన్ టీఆర్ఎస్ ఇన్చార్జిలు, నాయకులు, ముఖ్యనాయకులను సన్మానించారు. ఈ కార్య్రమంలో గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా, శ్రీనుపటేల్, టీఆర్ఎస్ నాయకులు రాగం జంగయ్య యాదవ్, యుత్ నాయకులు వెంకటేశ్ ముదిరాజ్తో పాటు పలువురు టీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.