పహాడీషరీఫ్ : పేదలకు ఎల్లప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని షాహీన్నగర్కు చెందిన మహ్మద్ సాజిద్ గత కొన్నాళ్లుగా క్యాన్సర్తో బాధపడుతున్నాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా మెరుగైన చికిత్స చేయించుకోలేకపోతున్నాడు.
ఇదే విషయాన్ని స్థానిక టీఆర్ఎస్ నాయకుల సహాయంతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి దృష్టికి తీసుకెళ్లగా స్పందించిన మంత్రి నిమ్స్ దవాఖానలో మెరుగైన చికిత్స కోసం రూ. 1 లక్షా 25వేలకు సంబంధించిన ఎల్వోసీని బాధిత కుటుంబ సభ్యునికి అందజేశారు.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు షాకీర్ బేగ్, అమ్జద్ఖాన్, సైయ్యద్ అబ్దుల్ రవూఫ్, బాధితుడి కుటంబ సభ్యులు హమీద్ బాయి, అజీం ఖాన్ తదితరులు పాల్గొన్నారు.