హైదరాబాద్ : నగరంలోని ప్రభుత్వ దవాఖానల్లో ఓపీ సేవలను ప్రారంభించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉన్నతాధికారులను ఆదేశించారు.
అర్బన్ హెల్త్సెంటర్లు, బస్తీ దవాఖానల్లో ఓపీ సేవలను వెంటనే ప్రారంభించాలని సూచించారు. ఆదివారం ఆయన జీహెచ్ఎంసీ పరిధిలోని జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.
కొవిడ్ లక్షణాలున్న అందరికీ కిట్లు అందజేయాలని చెప్పారు. కరోనా లక్షణాలున్న వారిని గుర్తించేందుకు ప్రత్యేక సర్వే నిర్వహించాలని సూచించారు.
ఇంటింటి సర్వే నిర్వహణకు ప్రత్యేక బృందాలను నియమించాలన్నారు. ప్రతి బృందంలో ఇద్దరు మున్సిపల్ సిబ్బంది, ఇద్దరు ఆశా వర్కర్లు, ఓ ఏఎన్ఎం ఉండాలని తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.