ప్రతి బస్తీకి దవాఖాన ఏర్పాటు
రోగాలకు ఉచిత వైద్యం, మందులు అందజేత
వ్యక్తం చేస్తున్న స్థానికులు కేసీఆర్ మేలు మరువలేనిదని కితాబు
కాచిగూడ, డిసెంబర్ 11: పేదలకు కార్పొరేట్ తరహాలో వైద్యం అందించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ బస్తీ దవాఖానలను అందుబాటులోకి తెచ్చారు. దేశంలో ఎక్కడాలేని విధంగా ప్రభుత్వం పేదల ఆరోగ్యాన్ని దృష్టి లో ఉంచుకుని బస్తీ దవాఖానల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో కామ్గార్నగర్లో డిసెంబర్ మూడున బస్తీ దవాఖాన అందుబాటులోకి వచ్చింది.
అన్ని రోగాలకు చికిత్స..
ఈ బస్తీ దవాఖానలో బీపీ, షుగర్, థైరాడ్, కొలస్ట్రాల్, మలేరియా, డెంగీ, దగ్గు, చర్మ సమస్యలు, చిన్న పిల్లల వ్యాధులకు చికిత్సలతో పాటు ఇతర చికిత్సలను అందిస్తున్నారు. ఆయా రోగులకు అవసరమైన మందులను ఉచితంగా అందిస్తున్నారు. వైద్యంతో పాటు అన్ని రకాల రక్త పరీక్షలు ఉచితంగా చేస్తున్నారు.
రోజుకు వందకుపైగా..
మౌలానా ఆజాద్నగర్లో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానకు ప్రతి రోజూ 100 మందికి పైగా రోగులు వస్తున్నా రు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇందులో డాక్టర్, నర్సు అందుబాటులో ఉంటారు.
అన్ని జబ్బులకు వైద్యం అందిస్తున్నాం
అన్ని జబ్బులకు వైద్యం అందిస్తున్నాం.బీపీ, షుగర్ జబ్బులకు సంబంధించిన ప్రజలు అధికంగా వస్తున్నా రు. వారి ఆరోగ్య పరిస్థితులను గమనించి నెహ్రూనగర్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పంపిస్తున్నాం. యాకుత్పుర, డబీర్పుర, ఉప్పగూడ, మలక్పేట, చైతన్యపురి, చాదర్ఘాట్, తదిరత ప్రాంతాల నుంచి వచ్చే రోగులకు మెరుగైన వైద్యాన్ని అదిస్తున్నాం.