సుల్తాన్బజార్,మే 19 : వైద్యో నారాయణో హరి అన్న పదానికి కింగ్కోఠి జిల్లా దవాఖాన వైద్యులు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఏడాది నుంచి నిరంతరం కొవిడ్ బారిన పడిన రోగుల మధ్య ఉంటూ వారి ప్రాణాలను కాపాడుతున్నారు.ఎంతో ధైర్యంగా దవాఖానలో విధులు నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది, హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ ప్రతినిధులు తమ వంతుగా రోగులకు వైద్య సేవలందిస్తున్నారు.
దవాఖానలో మొత్తం 350 పడకలతో వైద్య సేవలందిసున్న విషయం విధితమే. రద్దీకనుగుణంగా 50 పడకలు పెంచారు. 400 పడకలతో రోగులకు వైద్య సేవలు అందిస్తున్నారు. 350 ఆక్సిజన్ , 17 ఐసీయూ, 33 వెంటిలేటర్ పడకలున్నాయి. వైద్యులు కొవిడ్ బారిన పడిన వారికి సాచురేషన్ లెవల్ ప్రకారం వైద్య సేవలు అందిస్తున్నారు.