జగిత్యాల జిల్లాలోని అంబారిపేటకు చెందిన గోపు రాధ (38) గృహిణి. ఆమెకు భర్త గోపు శ్రీనివాస్, కుమారుడు ఉన్నారు. ఈ నెల 12న రాధ అపస్మారక స్థితిలోకి వెళ్లారు. కుటుంబ సభ్యులు సికింద్రాబాద్లోని కిమ్స్ దవాఖానలో చేర్పించారు.
చికిత్స అందిస్తున్న వైద్యులు 13న బ్రేయిన్ డెడ్గా నిర్ధారించారు. రాధ కుటుంబ సభ్యులను కలిసిన జీవన్దాన్ ప్రతినిధులు అవయవదానం విశిష్టతను వివరించగా, అందుకు అంగీకరించారు. కాలేయం, గుండె, రెండు మూత్రపిండాలు, ఒక ఊపిరితిత్తిని
సేకరించారు.
– ఖైరతాబాద్, మార్చి 14