గూగుల్ సెర్చ్ చేసి కోట్లు పోగొట్టుకుంటున్నారు అమాయక ప్రజలు. అందులో సైబర్ జాదుగాళ్లు తిష్ట వేయడంతో వారు పెట్టిన వివరాలు నిజమేనని నమ్మి మోసపోతున్నారు. దీనిపై సైబర్ క్రైం పోలీసులు అవగాహన కల్పిస్తున్నా అమాయకులు వాటిని పట్టించుకోకపోవడంతో కోట్లాది రూపాయలు వదులుకుంటున్నారు. ముఖ్యంగా వివిధ సంస్థల కస్టమర్ కేర్కు సంబంధించిన ఫోన్ నంబర్ల కోసం గాలించి బాధితులు అడ్డంగా బుక్ అవుతున్నారు. గూగుల్ సెర్చ్కు పోయి మరీ.. సైబర్ మోసగాళ్లకు చిక్కిపోతున్నారు.
గత ఏడాది ఈ విధంగా కస్టమర్ కేర్ ఫోన్ నంబర్ల కోసం గాలించి దాదాపు 134మంది దాదాపు రూ.1.55కోట్లు తమ ఖాతాల నుంచి సైబర్ నేరగాళ్ల ఖాతాలోకి జమ చేశారు. ఈ నేపథ్యంలో సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు గూగుల్, యాహూ, బింగ్ దాంట్లో సెర్చ్చేసి మోసపోవద్దని కోరుతున్నారు. దీంట్లో భాగంగా బుధవారం నుంచి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. కస్టమర్ కేర్ కోసం సంస్థలకు సంబంధించిన వెబ్సైట్లు లేదా యాప్లను డౌన్లోడ్ చేసుకుని వాటిలోని నంబర్లకు కాల్ చేయాలన్నారు. అంతే తప్పా అన్నింటినీ గుడ్డిగా నమ్మి అందులో ఉన్న ఫోన్ నంబర్లకు ఫోన్ చేసి డబ్బులు పోగొట్టుకోవద్దని పోలీసులు సూచిస్తున్నారు.