Gold Seized | శంషాబాద్ విమానాశ్రయంలో అధికారులు అక్రమంగా బంగారం తలిస్తుండగా పట్టుకున్నారు. దాదాపు కిలోన్నర బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న బంగారం విలువ రూ.77.90లక్షల విలువైన 1,476 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ స్వాధీనం చేసుకుంది. మస్కట్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల నుంచి ఈ బంగారాన్ని పట్టుకున్నది. పక్కా సమాచారం మేరకు ప్రయాణికురాలి లగేజీ నుంచి తనిఖీ చేశారు. శానిటరీ ప్యాడ్స్ మధ్యలో దాచి తెచ్చినట్లు కస్టమ్స్ అధికారులు గురించారు. సదరు ప్రయాణికులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.