Gold Seized | శంషాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని పట్టుకున్నారు. దుబాయి నుంచి వచ్చిన ప్రయాణికుడి నుంచి బంగారాన్ని గుర్తించారు. లోహపు పరికరంలో బంగారాన్ని వైరు రూపంలో దాచి తరలించేందుకు ప్రయత్నించగా.. అధికారులు తనిఖీలు చేసి పట్టుకున్నారు. 449 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని.. ఆ బంగారం విలువ రూ.27.92లక్షలు ఉంటుందని పేర్కొన్నారు. సదరు వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వివరించారు.