హైదరాబాద్ : మాదాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని కావూరిహిల్స్లో ఓ వ్యాపారి ఇంట్లో భారీ చోరీ జరిగింది. రూ. 30 లక్షల విలువైన బంగారం, రూ. 20 లక్షల నగదుతో పాటు అమెరికన్ డాలర్లను దొంగలు అపహరించారు. వ్యాపారి వాసుదేవరెడ్డి ఇంటికి తాళం వేసి ఓ వేడుకకు వెళ్లి తిరిగొచ్చేసరికి ఈ దొంగతనం జరిగింది.
తాను ఇంటికి తిరిగొచ్చే సరికి.. తలుపులు తెరుచుకోవడంతో అనుమానం వచ్చి ఇంటిని నిశితంగా పరిశీలించాడు. ఇంట్లో ఉన్న బంగారం, నగదు చోరీ అయినట్లు గుర్తించాడు వాసుదేవరెడ్డి. దీంతో వాసుదేవరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇంటి పని మనషులే దొంగతనానికి పాల్పడినట్లు వాసుదేవరెడ్డి అనుమానం వ్యక్తం చేస్తున్నాడు.