మెహిదీపట్నం: చారిత్రాత్మక గోల్కొండ జగదాంబికఎల్లమ్మ ఆలయం బోనాలు ఈ ఆదివారంతో ముగియనున్నాయి. గురువారానికి 8 పూజలు ముగిశాయి. ఇదిలా ఉండగా జగదాంబిక ఎల్లమ్మ ఆలయం హుండీని గురువారం సాయంత్రం మూడోసారి లెక్కించారు. ఆదాయం 74వేల రూపాయలు వచ్చింది. దీంతో ఇప్పటి వరకు 5లక్షల 18 వేల రూపాయల వరకు ఆదాయం వచ్చిందని ఆలయ ట్రస్టు ఛైర్మన్ కోయల్కార్ గోవింద్రాజ్, ఈవో ఎస్.మహేందర్కుమార్లు తెలిపారు