ఎల్బీనగర్/వనస్థలిపురం/చంపాపేట/మన్సూరాబాద్, అక్టోబర్ 18: మహాసరస్వతి దేవి అమ్మవారు గాయత్రి మాత అలంకారంలో, మహాలక్ష్మి అమ్మవారు ఆదిలక్ష్మి అలంకారంలో దర్శనమిచ్చాబీఎన్రెడ్డినగర్ హరిహరపురం కాలనీలోని త్రిశక్తి అమ్మవార్ల దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నాలుగోరోజైన బుధవారం మహా దుర్గాదేవి అమ్మవారు కూష్మాండ దుర్గాదేవి అమ్మవారి అలంకారంలో దర్శనమిచ్చారు. అదే విధంగా రు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ డి.విజయ్కుమార్, మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ ఎన్.నారాయణరెడ్డి, రవీంద్రకుమార్, రజిత, ఈశ్వర్రావు, స్వతంత్య్రరెడ్డి, రవీంద్రారెడ్డి, సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు.
వనస్థలిపురం రైతు బజార్ సమీపంలోని హుడాపార్కు దుర్గాస్థలిలో నవరాత్రి ఉత్సవాలు బుద్దోలు అర్జున్గౌడ్ ఆధ్యర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. బుధవారం అమ్మవారు మహాలక్ష్మి అలంకారంలో దర్శనమిచ్చారు. దుర్గా స్థలి కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
సహారాస్టేట్స్కాలనీలో నెలకొల్పిన మండపం, సీఆర్ ఎన్క్లేవ్లోని పోచమ్మ దేవాలయం, శ్రీసాయినగర్కాలనీలోని శ్రీదుర్గాదేవి దేవాలయంలో దేవీశరన్నవరాత్రి ఉత్సవాలను భక్తి, శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. బుధవారం అమ్మవారిని మహాలక్ష్మి దేవి రూపంలో అలంకరించి పూజలు నిర్వహించారు. సీఆర్ ఎన్క్లేవ్లోని పోచమ్మ దేవాలయంలో అమ్మవారిని మాజీ కార్పొరేటర్, ఆలయ కమిటీ చైర్మన్ కొప్పుల విఠల్రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సహారాస్టేట్స్కాలనీలో ఉత్సవ కమిటీ అధ్యక్షుడు రాపోలు విశ్వనాథం ఆధ్వర్యంలో నిర్వహించిన పూజా కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
పాపేట డివిజన్ దుర్గానగర్ కాలనీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సీతారామాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో ప్రతిష్ఠించిన దుర్గమాత పూజలు బుధవారం భక్తి శ్రద్ధలతో నిర్వహించి.. అన్నదానం చేశారు. ముఖ్య అతిథులుగా జయచంద్రారెడ్డి చారిట్రబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ దేవిరెడ్డి కమలాసుధీర్రెడ్డి, కర్మన్ఘాట్ హనుమాన్ ఆలయ చైర్మన్ నల్ల రఘుమారెడ్డి హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కర్మన్ఘాట్ హనుమాన్ ఆలయ ధర్మకర్త బిల్లకంటి కిరణ్కుమార్ గుప్తా, సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడు బి.వెంకటేశ్, అధ్యక్షుడు కుడుముల యాదగిరిరెడ్డి, ఉపాధ్యక్షులు ఆనంద్దీక్షిత్, పి.రామకృష్ణాచారి, వెంకటేశ్వర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి వంగ జగన్నాథ్రెడ్డి, సహాయ కార్యదర్శులు ఎస్.సతీశ్కుమార్, ఎస్.సందీప్కుమార్, బి.రవిప్రశాంత్, పి.రమేశ్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ పి.వెంకట్రెడ్డి, కోశాధికారి బిల్లకంటి కిరణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ ఇస్తున్న పింఛన్తో ఆత్మగౌరవం పెరిగింది
మహేశ్వరం, అక్టోబర్ 18: వృద్ధులు, వితంతువులను గతంలో ఎవరూ పట్టించుకోలేదు. సీఎం కేసీఆర్ వచ్చిన తర్వాతనే మాకు పింఛన్ ఇస్తుండు. కేసీఆర్ సార్ ఎక్కడ ఉన్నా సల్లగా ఉండాలి. ఆయన మేలు ఎప్పటికీ మరువం. సారు మల్లా వస్తే అందరి బతుకులు మారుతాయి. 2 వేల పింఛన్లను 3 వేలు చేసిండు ఇప్పుడు 4 వేలు ఇస్తానంటుండు. మాకు సంతోషంగా ఉంది. రైతులు, ఇతర కులస్తులకు తగిన సాయం అందిస్తుండు. కేసీఆర్ ఇస్తున్న పింఛన్లతో మాకు ఆత్మగౌరవం పెరిగింది.