ఘట్కేసర్ రూరల్, జనవరి 16 : ఘట్కేసర్ మండలం, ఎదులాబాద్లోని శ్రీగోదా సమేత శ్రీమన్నారు రంగనాయక స్వామి కల్యాణ వేడుకలు సోమవారం అంగరంగవైభంగా జరిగాయి. ఎదులాబాద్ గ్రామంలో స్వయంభుగా వెలసి భక్తుల కొంగుబంగారం గా నిలిచిన శ్రీగోదాదేవి కల్యాణ వేడుకలను వందలాది మంది భక్తుల సమక్షంలో నిర్వహించారు. భక్తులు, మహిళలు అధిక సంఖ్య లో పాల్గొని కల్యాణాన్ని వీక్షించి తరించారు. స్థానిక ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, కల్పనారెడ్డి దంపతులు అమ్మవారికి పట్టువస్ర్తాలు, తలంబ్రాలు సమర్పించారు.
ఆలయ ధర్మకర్తలు ఎమ్మెల్యే దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారి కల్యాణంలో భాగంగా వేదపండితులు విశ్వకసేన ఆరాధన, పుణ్యహ వాచనం, రక్షాబంధన, జిలకర బెల్లం గురించి భక్తులకు వివరించారు. గోవింద నా మస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. అనంతరం అన్నదాన కార్యక్రమం ని ర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుదర్శన్ రెడ్డి, సర్పంచ్ సురేశ్, మండల బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి పన్నాల కొండల్ రెడ్డి, ఆలయ ధర్మకర్తలు లక్ష్మణాచార్చులు, గోవిందాచార్యులు, శేషాచార్యులు, పురుషోత్త మాచార్యులు, సేనామాచార్యులు, రఘునాథచార్యులు, వరప్రసాదాచార్యులు పాల్గొన్నారు.